|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 05:47 PM
కోలీవుడ్ స్టార్ విజయ్ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'జన నాయగన్' పై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించిన ఈ హై-బడ్జెట్ ఎంటర్టైనర్ ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ ని డిసెంబర్ 27న మలేషియాలో నిర్వహించటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విష్యం పై మూవీ మేకర్స్ నుండి రానున్న రోజుల్లలో క్లారిటీ రానుంది. ఈ చిత్రం బాలకృష్ణ యొక్క భగవాంత్ కేసరి యొక్క అధికారిక రీమేక్ అని పుకారు ఉంది. తన రాజకీయ ప్రవేశానికి ముందు జన నయాగన్ విజయ్ యొక్క చివరి చిత్రాన్ని సూచిస్తుంది. అభిమానులలో హైప్ మరియు ఉత్సాహం అపూర్వమైనవి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచాండర్ సంగీత స్వరకర్తగా ఉన్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే , బాబీ డియోల్ విలన్ మరియు మామిత బైజు, ప్రకాష్ రాజ్ మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి సహాయక నటులతో సహా ఆకట్టుకునే తారాగణాన్ని కలిగి ఉంది. కె వెంకట్ నారాయణ తన కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ క్రింద ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను తాకనుంది.
Latest News