|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 05:10 PM
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'పరధా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాపై టీజర్ భారీ అంచనాలను నెలకొల్పింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఆగష్టు 9న సాయంత్రం 4:30 గంటలకి నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం తెలుగు, మలయాళం రెండు భాషల్లోనూ ఆగష్టు 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అనుపమతో కలిసి దర్శన రాజేంద్రన్, సంగీత క్రిష్ మరియు రాగ్ మయూర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసులు పి, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మించారు.
Latest News