|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:11 PM
అరుణ్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు - దర్శకుడు - మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ తన తదుపరి 25వ ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో 'భద్రకాళి' అనే పేరుతో విడుదల అవుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని తెలుగురాష్ట్రాలలో ఆసియాన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ విడుదల చేయనుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకున్నట్లు సమాచారం. సినిమాటోగ్రఫీ మరియు బిజిఎంలను వరుసగా షెల్లీ కాలిస్ట్ మరియు విజయ్ ఆంటోనీ నిర్వహిస్తున్నారు. స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వాఘా చంద్రశేఖర్, సునీల్ కృపలాని, సెల్ మురుగన్, ట్రిప్టి రవీంద్ర, మరియు మాస్టర్ కేశవ్ కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
Latest News