|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 07:19 PM
కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'కిష్కీందపురి' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. హర్రర్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా అధికారిక విడుదల తేదీ త్వరలో వెల్లడి కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క ఫస్ట్ గ్లింప్సెని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని ఉండిపోవే నాతోనే అనే టైటిల్ తో ఆగష్టు 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. చిన్మయ్ సలాస్కర్ కెమెరా క్రాంక్ చేయనుండగా, కాంతారావు ఫేమ్ బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరత్త్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. శ్రీమతి షైన్ స్క్రీన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం. 8ని అర్చన సమర్పిస్తున్నారు.
Latest News