|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 02:52 PM
ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కీలక షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన జోడిగా శ్రీలీల నటించింది. ప్రముఖ నటి రాశి ఖన్నా ముఖ్య పాత్రలో కనిపించనుంది. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్లు ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Latest News