|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 04:02 PM
ప్రముఖ తెలుగు నిర్మాత విశ్వ ప్రసాద్ 'గరివిడి లక్ష్మి' అనే టైటిల్తో అద్భుతమైన ప్రాజెక్ట్ను ప్రకటించారు. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి 48వ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తుండగా, గౌరీ నాయుడు జమ్ము దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని విడుదల చేయగా భారీ స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాలో ప్రముఖ యువ నటుడు రాగ్ మయూర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో నటుడు సత్తి బాబు అనే పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. గరివిడి లక్ష్మి ఉత్తర ఆంధ్రకు చెందిన దిగ్గజ బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి యొక్క స్ఫూర్తిదాయకమైన కథను చెబుతుంది మరియు మహిళల గుర్తింపు దొంగతనం యొక్క ఇతివృత్తాన్ని అన్వేషిస్తుంది. రాసి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. జె. ఆదిత్య సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చరణ్ అర్జున్ సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Latest News