![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:25 PM
ప్రముఖ డైరెక్టర్ మరియు నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా "సీతా పయనం"అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాలో నిరంజన్ కథానాయకుడుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిరంజన్ కి జోడిగా ఐశ్వర్య అర్జున్ నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ మూవీ పై భారీ ప్రభావాన్ని చూపింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని ఏ ఊరికెళ్తావ్ పిల్ల అనే టైటిల్ తో జులై 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అనూప్ రూబెన్స్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి చంద్ర బోస్ లిరిక్స్ అందించారు. ఈ సినిమాలో సత్య రాజ్, ప్రకాష్ రాజ్, ధృవ్ సర్జ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా మ్యాన్ గా బలమురుగన్, ఎడిటర్ గా అయూబ్ ఖాన్, రైటర్ గా సాయి మాధవ్, చంద్ర బోస్ ఉన్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అర్జున్ సర్జా తన శ్రీ రామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.క న్నడలో ప్రాథమికంగా చిత్రీకరించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.
Latest News