|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 08:51 AM
ప్రఖ్యాత పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ '8 వసంతాలు' అనే కంటెంట్-ఆధారిత చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తొలి చిత్రం మను విమర్శకుల ప్రశంసలు మరియు అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ చిత్రంలో మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ శుద్ధి అయోధ్య అనే మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలిగా నటించింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా పై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ప్రోమోని పరిచయామిలా అనే టైటిల్ తో విడుదల చేసారు. అంతేకాకుండా ఫుల్ సాంగ్ ని జూన్ 11న మధ్యాహ్నం 3:33 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి వనమాలి లిరిక్స్ అందించారు. చిత్ర గారు ఈ సాంగ్ కి తన గాత్రాణి అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు జానర్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. షూటింగ్ పూర్తవుతున్న కొద్దీ, మేకర్స్ రెగ్యులర్ అప్డేట్లను విడుదల చేస్తారు. ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బందిలో అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్గా, శశాంక్ మాలి ఎడిటర్గా మరియు బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని వింగ్ చున్ అంజి నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.
Latest News