![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:10 PM
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని, అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం ద్వారా తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. ఘటికాచలం సినిమా ట్రైలర్ వేడుకలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.చిత్ర పరిశ్రమ ఐసీయూలో ఉందని, యాంటీ బయోటిక్స్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. సినిమా పర్సంటేజీ విధానం కంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చూడాలన్నారు. టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు థియేటర్లలో లభించే తినుబండారాల ధరలు కూడా అధికంగా ఉంటున్నాయని ఫిర్యాదులు ఉన్నాయని, సినీ పెద్దలు ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు.ఓటీటీల వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన అన్నారు. ఉదయం ఆటకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారని, సాయంత్రం షోలకు, వారాంతాల్లో మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని ఆయన అన్నారు. సాధారణ రోజుల్లో టికెట్ ధరలు తగ్గించి, వారాంతాల్లో ధరలు పెంచడం వంటి విధానాలపై ఆలోచన చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.
Latest News