![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:56 PM
పవన్ ప్రభ దర్శకత్వంలో రుపీష్ కథానాయకుడిగా ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ 'షష్ఠి పూర్తి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం వివిధ ప్రదేశాలలో ప్రధానంగా రాజమండ్రీ సమీపంలో, గోదావరి ప్రాంతం యొక్క సహజ సౌందర్యాన్ని సంగ్రహిస్తుంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా విజయవాడలో ఉన్నారు. మేకర్స్ కనక దుర్గ ఆలయాన్ని సందర్శించి అశీసులు తీసుకున్నారు. ఈ సందర్శానికి సంబందించిన చిత్రాలని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ సినిమా మే 30న విడుదల కానుంది. ఐకానిక్ 'లేడీస్ టైలర్' చలన చిత్ర జంట రాజేంద్ర ప్రసాద్ మరియు అర్చన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మా AAIE ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇళయరాజా ఈ సినిమాకి మ్యూజిక్ ని అందిస్తున్నారు.
Latest News