|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 07:00 PM
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి 'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్ను ఖరారు చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో సంయుక్త మరియు సాక్షి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాని మేకర్స్ 2026 సంక్రాంతికి విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయం పై క్లారిటీ రానుంది. ఈ సినిమాలో సంగీత స్వరకర్తగా విశాల్ చంద్ర శేఖర్, సినిమాటోగ్రాఫర్గా జ్ఞాన శేఖర్ VS మరియు కళా దర్శకుడిగా బ్రహ్మ కడలి ఉన్నారు. భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు సమకూర్చారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి విశాల్ చంద్రశేఖర్ సౌండ్ట్రాక్ అందించనున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అనిల్ సుంకర యొక్క ఎకె ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మించారు.
Latest News