|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 08:46 AM
యువ దర్శకుడు సందీప్ రాజ్ తన తాజా చిత్రం 'మోగ్లీ 2025' తో తిరిగి వచ్చాడు. బబుల్ గమ్ ఫేమ్ రోషన్ కనకాలా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటికే బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్, హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని వరల్డ్ అఫ్ మోగ్లీ గ్లింప్సె సినిమా పై భారీ అంచనాలు పెంచింది. తాజాగా ఇప్పుడు చిత్ర దర్శకుడు సందీప్ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జర్గుతున్నట్లు సోషల్ మీడియాలో సెట్స్ నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేసి ప్రకటించారు. ప్రస్తుతం షూట్ జరుగుతోంది, విడుదల తేదీ త్వరలో ప్రకటించబడుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ క్రింద టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడు. రామమూర్తి, పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్నారు.
Latest News