|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 06:13 PM
పవన్ కల్యాణ్ ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్లకుపైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఆయన సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. ఈ మూవీతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే, ఓజీ సినిమాకి రిలీజ్ కి ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీపై పవన్ కళ్యాణ్ గత చిత్రం హరి హర వీరమల్లు ప్రభావం ఉంటుందనుకున్నారు.కానీ, అసలు ఆ సినిమా ప్రభావ ఛాయలు కూడా పడలేదు. ఏపీ, తెలంగాణలలో ప్రత్యేకంగా ప్రదర్శించిన ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ తో కంప్లీట్ పాజిటివ్ టాక్ రావడంతోనే ఓజీ సక్సెస్ స్కేల్ ని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్యారెంటీగా గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, తొలిప్రేమ, గబ్బర్ సింగ్ సినిమాలు సృష్ఠించిన ఇండస్ట్రీ హిట్ ని ఓజీ కూడా సృష్ఠిస్తుందని చెప్పుకున్నారు. అలాగే, సుజీత్ కూడా హైప్ ని క్రియేట్ చేశాడు. 11 రోజులు ముగిసే సరికి ఓజీ రూ.300 కోట్ల మార్క్ ని దాటేసింది.ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగానూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఓజీ రూ 308 కీట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. 2025 లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన తెలుగు సినిమాగా ఓజీ సరికొత్త రికార్డుని నమోదు చేసింది. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి పవన్ మేనియా ప్రధాన కారణం అయితే, దర్శకుడు సుజీత్ టేకింగ్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓజీ సక్సెస్లో ముఖ్య భాగమయ్యాయి. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్సింగ్' సినిమాపై అంచనాలు తారాస్థాయిలో పెరిగాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్సింగ్' లో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్గా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.
Latest News