|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 04:19 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఒక ప్రాజెక్ట్ కోసం జతకట్టిన సంగతి అందరికి తెలిసిందే. అట్లీ ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం పూర్తి స్క్రిప్ట్ను పూర్తి చేసారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ట్రిపుల్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ముఖ్య వ్యక్తిని మేకర్స్ త్వరలో వెల్లడించటానికి ప్లాన్ చేస్తునట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మాగ్నమ్ ఓపస్ చిత్రంలో స్టార్ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. యువ తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ సౌండ్ట్రాక్ను స్కోర్ చేయనున్నారు.
Latest News