|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 03:46 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా పాన్-ఇండియా చిత్రం "మిరాయ్"తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ సమీక్షలని అందుకుంటుంది. ఈ యాక్షన్ డ్రామా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమ్నేని సినిమాటోగ్రఫీ మరియు స్క్రీన్ప్లే రెండింటినీ నిర్వహించారు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రితిక నాయక్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. మేకర్స్ ఈ సినిమా సక్సెస్ అయ్యిన సందర్భంగా మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర బృందం USAకి చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో చిత్రాల్ని పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో శ్రియా సరన్, జయరం, జగపతి బాబు, శ్రీను, వెంకటేష్ మహా కూడా కీలక పాత్రల్లో నటించారు. గౌర హరి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. శ్రీ నాగేంద్ర తంగల కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమని టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించారు.
Latest News