|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 07:54 AM
కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం కాంతారా: చాప్టర్ 1 అక్టోబర్ 2, 2025న బహుళ భాషలలో భారీ విడుదల కోసం సిద్ధమవుతోంది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. మొదటి విడత కన్నడ, తెలుగు మరియు హిందీలలో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. హోంబేల్ ఫిల్మ్స్ ఈసినిమాని నిర్మిస్తుండగా, అజనీష్ లోక్నాథ్ సంగీత స్వరకర్తగా ఉన్నారు. శాండల్వుడ్ బ్యూటీ రుక్మిని వాసంత్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య విలన్ పాత్రలో కనిపించనున్నారు.
Latest News