తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 09:18 PM
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మంత్రి సురేఖ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు ఆమె హాజరు కాలేదు. దీంతో నాంపల్లి కోర్టు ఆమెపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.పిటిషన్పై విచారణ సందర్భంగా కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీలోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.