|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:25 PM
తెలంగాణకు పట్టిన చీడ, పీడను ఎలా వదిలించాలో తనకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని చెబితే విమర్శిస్తున్నారని, గత పాలకులు పదేళ్లలో వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకున్నా దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదని ఓయూ సభలో మండిపడ్డారు. ఇంగ్లిష్ రాకపోయినా నాలెడ్జ్, కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధ్యమేనని, జర్మనీ, జపాన్, చైనా వాళ్లకూ ఇంగ్లిష్ రాదని పేర్కొన్నారు.