|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 10:29 PM
రైల్వే ప్రయాణికుల రద్దీని.. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణలోని చర్లపల్లి, హైదరాబాద్ ప్రధాన కేంద్రాల నుంచి దేశంలోని వివిధ ముఖ్య గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్ల ద్వారా ప్రయాణికులకు సులభంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. మొత్తం 8 ప్రత్యేక రైళ్లు వివిధ మార్గాల్లో నడవనున్నాయి.
ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు..
ప్రయాణీకుల సౌకర్యం కోసం రైల్వేశాఖ ప్రకటించిన ప్రత్యేక రైళ్ల వివరాలు.. వాటి ప్రయాణ వేళలు కింద ఇవ్వబడ్డాయి.
చర్లపల్లి – యలహంక ..
ఇది చర్లపల్లి నుంచి సోమవారం (రేపు) రాత్రి 10:00 గంటలకు ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. తిరిగి.. యలహంక నుంచి ఈ నెల 9న మధ్యాహ్నం 1:00 గంటలకు చర్లపల్లికి బయల్దేరుతుంది.
చర్లపల్లి – షాలిమార్
ఈ ట్రైన్ చర్లపల్లి నుంచి సోమవారం రాత్రి 9:35 గంటలకు షాలిమార్కు ప్రత్యేక రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో.. షాలిమార్ నుంచి ఈ నెల 10న మధ్యాహ్నం 12:10 గంటలకు చర్లపల్లికి తిరిగి వస్తుంది.
చర్లపల్లి – హెచ్. నిజాముద్దీన్..
ఈ ట్రైన్ చర్లపల్లి నుంచి సోమవారం రాత్రి 9:45 గంటలకు న్యూఢిల్లీలోని హెచ్. నిజాముద్దీన్కు ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో.. నిజాముద్దీన్ నుంచి ఈ నెల 10న ఉదయం 4:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
హైదరాబాద్ – కొట్టాయం..
ఈ ట్రైన్ హైదరాబాద్ నుంచి సోమవారం రాత్రి 9:50 గంటలకు కేరళలోని కొట్టాయానికి ప్రత్యేక రైలు నడవనుంది. తిరుగు ప్రయాణంలో.. కొట్టాయం నుంచి ఈ నెల 10న ఉదయం 7:45 గంటలకు హైదరాబాద్కు ప్రత్యేక రైలు బయల్దేరుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లు కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్ల మీదుగా కూడా ప్రయాణించనున్నాయి. దీని వల్ల ఏపీ ప్రయాణికులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వేశాఖ ఈ ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ప్రయాణీకులు తమ టికెట్లను ఆన్లైన్లో లేదా కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. వచ్చే పండుగల సమయంలో ప్రయాణీకుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని.. రైల్వే అదనపు బోగీలను లేదా మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.