![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 07:42 PM
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 విషయాన్ని ప్రస్తావిస్తే ‘నాలుక కోస్తావా?’ అంటూ మండిపడ్డారు. దమ్ముంటే నాలుక కోయమని సవాల్ విసిరారు. తనతో విరోధానికి వచ్చినవారు ఎవరూ మిగలలేదని అన్నారు. తన్ను చంపేందుకు అమెరికా, ఇండియాలో కొంతమంది ప్రయత్నించినా వాళ్లెవ్వరూ ఇప్పుడు లేరని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.