![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 02:28 PM
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి మీటింగ్ హల్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసిన దిశ సమావేశానికి బుధవారం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సరితమ్మ ఎంపీ మల్లు రవికి శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.