![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 08:21 PM
ఆషాడమాసం బోనాల ఉత్సవాల పురస్కరించుకొని చారిత్రాకమైన లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి దేవాలయం అధ్యక్షుడు మారుతి యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీల నడుమ గోల్కొండ కోటపై శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయానికి శుక్రవారం బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యంతో బయలుదేరారు. ఈ సందర్భంగా మారుతి యాదవ్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలు చరిత్ర కలిగిన గోల్కొండ జగదాంబ అమ్మవారికి మా తొలి బోనం సమర్పించడం ఆనందంగా ఉందని అన్నారు.