![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 08:09 PM
కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని యువకుడు (30) అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం అర్ధరాత్రి కాచిగూడ-మలక్పేట స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి ఒంటిపై లేత నీలిరంగు జీన్స్, నీలిరంగు చొక్కా ఉన్నాయి. ఎత్తు 5.5 ఫీట్లు. వివరాలకు 9573948545 నంబర్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.