![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 01:24 PM
కాళేశ్వరం ప్రాజెక్టు మొదట తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా రూపొందించబడిందని, అయితే తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చినట్లు BRS నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు.
శనివారం తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా, 85 పియర్లుగా నిర్మించినట్లు వెల్లడించారు.