|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 08:26 PM
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని టాలెంటెడ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తునట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'OG' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా పై భారీ హైప్ ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా చివరి రోజు షూటింగ్ పూర్తి అయ్యిన సందర్భంగా సినిమా సెట్స్ నుండి ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
Latest News