|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 09:37 AM
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పైప్ లైన్ లో అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న 'భైరవం' ఒకటి. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్తో పాటు మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ అనౌన్స్మెంట్ ని ఈరోజు చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళై, ఆనంది కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు. యాక్షన్తో కూడిన సన్నివేశాలకు ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ మరియు నటరాజ్ మాడిగొండ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు మరియు సిబ్బందితో, భైరవం ఒక మరపురాని సినిమా అనుభూతిని కలిగిస్తుంది. పెన్ స్టూడియోస్కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళ బ్లాక్బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్.
Latest News