|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 04:51 PM
కోలీవుడ్ నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన తమిళ డ్రామా చిత్రం 'ఇడ్లి కడై' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 1, 2025న ఈ సినిమా విడుదల కానుంది. ఇడ్లీ కడై తెలుగులో "ఇడ్లీ కోటు" అనే టైటిల్ తో విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సీడెడ్ థియేటర్ రైట్స్ ని దీప ఆర్ట్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, ధనుష్ కథానాయకుడిగా నటించాడు. నిత్య మీనన్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అరుణ్ విజయ్ విరోధిగా నటించాడు. అరుణ్ విజయ్, పార్థిబాన్, రవి కిరణ్, షాలిని పండేయ్ మరియు సత్యరాజ్ ఈ సినిమాలో సహాయక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వండర్బార్ ఫిల్మ్స్ మరియు డాన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.
Latest News