|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 07:49 PM
టాలీవుడ్ నటుడు తేజా సజ్జాప్రధాన పాత్రలో నటించిన 'మిరాయ్' బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. కార్తీక్ గటమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. ఈ సినిమాలో రితిక నాయక్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో శ్రియా సరన్, జయరం, జగపతి బాబు, శ్రీను, వెంకటేష్ మహా కూడా కీలక పాత్రల్లో నటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి బుక్ మై షోలో 1.55M టికెట్స్ అమ్ముడయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. శ్రీ నాగేంద్ర తంగల కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమని టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించారు. గౌర హరి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
Latest News