|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 04:01 PM
పవన్ కల్యాణ్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజి' సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు దీనికి 'యూ/ఏ' సర్టిఫికేట్ను జారీ చేశారు. దీంతో సినిమా విడుదలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ అవతారంలో కనిపించనున్నారని చిత్ర యూనిట్ మొదటి నుంచి చెబుతోంది. యాక్షన్, ఎమోషన్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సెన్సార్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సినిమాపై అంచనాలను తారస్థాయికి చేర్చాయి. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
Latest News