|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 02:51 PM
కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'కిష్కీందపురి' చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ గా విడుదల అయ్యింది. హర్రర్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ సినిమాలో సుదర్శన్, ఆది, శాండీ మాస్టర్, తనికెళ్ల భరణి, ప్రేమ, శ్రీకాంత్, మర్ఖండ్ దేశ్ పండేయ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని సరిగమ సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క USA గ్రాస్ $250K మార్క్ కి చేరుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. చిన్మయ్ సలాస్కర్ కెమెరా క్రాంక్ చేయనుండగా, మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరత్త్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.
Latest News