|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 02:29 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా పోయిన, దొంగిలించబడిన సుమారు 6 లక్షల రూపాయల విలువైన 63 మొబైల్ ఫోన్లను రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి రికవరీ చేసి, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే చేతుల మీదుగా వాటి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా చిన్న లావాదేవీ కూడా చేయడం కష్టమని అన్నారు. బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.