|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 02:35 PM
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందరావుని ఎల్కరెడ్డి సెగ్మెంట్ కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు, డాక్టర్ పైడి ఎల్లారెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా రామచందరావు నాయకులకు సూచించారు. ఈ భేటీలో రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు హైమరెడ్డి కూడా పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగింది.