![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 02:16 PM
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఐటీ రంగంలో విజయం సాధించడానికి ఆంగ్లం ఎంత ముఖ్యమో, దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీని నేర్చుకోవడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, దక్షిణ భారతీయ సినిమాలలో 31 శాతం హిందీ డబ్బింగ్ ద్వారానే ఆదాయం వస్తుందని గుర్తు చేశారు. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు, నేర్చుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తన సినిమాలో "ఏ మేరా జహా" అనే హిందీ పాట పెట్టడానికి గల కారణాన్ని వివరిస్తూ, మాతృభాష తెలుగు అయినప్పటికీ, హిందీ దేశ భాష అని చెప్పడానికే అలా చేశానని తెలిపారు.హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదని, మరింత బలపడటమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మరో భాషను అంగీకరించడం ఓటమి కాదని, కలిసి ప్రయాణించడమని ఆయన ఉద్ఘాటించారు. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి వంటి రంగాలలో భాషా అవధులు చెరిగిపోతున్న ఈ సమయంలో హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.