![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 04:06 PM
ఆంధ్రాలో కలిపిన భద్రాచలం చుట్టు పక్కల 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. అన్యక్రాంతమవుతున్న ఏపీలోని 1000 ఎకరాల రాములవారి భూములను కాపాడాలన్నారు. 'దీనిపై మంత్రి తుమ్మల చొరవ తీసుకోవాలి. ఆంధ్రలోని రామాలయ భూములను చూడడానికి వెళ్తే భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈవోపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 5 గ్రామాలు, దేవుని మాన్యాలు TGకి ఇవ్వాలని చంద్రబాబుకు కూడా లేఖ రాస్తాం' అని చెప్పారు.