![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 12:36 PM
కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టలేని దుస్థితిలో ఉందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం బిల్లులు 3 నెలలుగా చెల్లించలేదన్నారు. విద్యార్థులకు ఒకపూట అన్నంపెట్టే పరిస్థితిలో కూడా లేరా? అని ప్రశ్నించారు. విద్యాశాఖ చూసేందుకు కాంగ్రెస్లో సమర్థమైన మంత్రి లేరా? అని అడిగారు.