![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:46 PM
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సునీల్ నారంగ్ ఈ పదవిని చేపట్టడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, పలువురు నిర్మాతలు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సన్మానించి, అభినందనలు తెలియజేశారు.అనంతరం సునీల్ నారంగ్ మాట్లాడుతూ, 150 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో ప్రేక్షకులను అలరించడానికి కేవలం 30 నుంచి 40 మంది హీరోలు మాత్రమే ఉన్నారని అన్నారు. "హీరోలు దేవుళ్ల లాంటి వారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాత చేయరు" అని ఆయన వ్యాఖ్యానించారు.అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ ఒక తుపాను లాంటి వారని, ఆయన సినిమాను ఆపే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. హీరోల పారితోషికం గురించి మాట్లాడే హక్కు తమకు లేదని, అయితే హీరోలు మరిన్ని చిత్రాలు చేయాలన్నదే తమ కోరిక అని తెలిపారు.