![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 10:55 AM
దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం నీలం మాట్లాడుతూ ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి ఆలయాన్ని నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానన్నారు. ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. దేవాలయాల నిర్మాణంతో భక్తిభావం అలవడడంతో పాటు మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జి రాజయ్య,కుమార్,రవీందర్, రమేష్,సురేందర్,రాజయ్య,మల్లేష్, మహేష్ , రంజిత్, మహేష్, శ్రీనివాస్, రవి,శేఖర్,నిర్వాహకులు,తదితరులు పాల్గొన్నారు.