![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 10:47 AM
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. శనివారం అమెరికా పర్యటన నుంచి రాగానే కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఏఐజీలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను కేటీఆర్ పరామర్శించారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబసభ్యులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు.కాగా, గత గురువారం మాగంటి గోపీనాథ్ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తున్నదని చెప్పారు.