![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:19 PM
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని, చట్టవిరుద్దంగా సాగుతున్న పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలను నిషేధించాలని, విద్యా హక్కు చట్టం అమలయ్యేలా చూడాలని, బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మి, జిల్లా సెక్రటరీ లక్ష్మీ నారాయణ, మండల కన్వీనర్ ప్రవీణ్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60 శాతం మంది విద్యార్దులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారని, ఈ ఫీజులు వారికి భారం అవుతుందన్నారు.