![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 03:24 PM
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే... పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే, ప్రమాద సమయంలో పనిచేస్తున్న కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఈ పెను విస్ఫోటనానికి ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కుప్పకూలింది. సమీపంలోని మరో భవనానికి కూడా బీటలు వారాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుని భయానక వాతావరణం నెలకొంది.ఈ దుర్ఘటనలో మొత్తం ఎనిమిది మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరిలో ఐదుగురు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరికొందరు కార్మికులు గాయపడినట్లు సమాచారం.