|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 03:00 PM
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసు మేరకు ఖమ్మం నగరంలోని 24వ డివిజన్ కు చెందిన కొప్పు శ్రీనివాస్ కు చికిత్స నిమిత్తం రూ. 60 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. ఈ మేరకు మంగళవారం స్థానిక డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి లబ్ధిదారుడికి అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.