![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 11:33 AM
యువత ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని, యువకులు బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ సూచించారు. చెడు వ్యసనాలు వద్దు, పోరాటాలే ముద్దు అను నివాదంతో డీవైఎఫ్ఐ చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం వైరా మండలంలోని గ్రామాల్లో సాగిన సందర్భంగా ఇరువురు మాట్లాడారు.