![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 11:23 AM
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 641 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్ లైఫ్ శాఖకు రూ. 35, 575 ఆదాయం లభించింది. 300 మంది బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ. 15, 120 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.