![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:05 PM
రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మక్తల్ ఎమ్మెల్యే డా. వాకిటి శ్రీహరిని ఆదివారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.