![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:03 PM
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజలకథే నా ఆత్మకథ' పుస్తకావిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 'దత్తాత్రేయ.. వాజ్పేయీ, అద్వానీ వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. పని చేసిన ప్రతి హోదాలో పేదలకు మేలు చేసేందుకు విశేషంగా కృషి చేశారు. అలయ్ బలయ్ ద్వారా అందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తున్నారు. అధికారం కేవలం పరపతి, పేరు కోసం కాదు.. సేవ చేసేందుకు అనేందుకు ఆయన జీవితం ఒక నిదర్శనం' అని కొనియాడారు.