![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:02 PM
మల్కాజిగిరి నియోజకవర్గం, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని జోహార్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన ధ్వజ స్తంభ పున: ప్రతిష్ట కుంభాభిషేకం కార్యక్రమంలో కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వాహణ అధికారి వెంకన్న, సంపత్ రావు, శ్రీనివాస్, నారాయణ, మల్లేష్ గౌడ్, పల్లె విజయా కుమారి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.