![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 05:21 PM
వీకెండ్ పార్టీ ముగించుకుని తిరిగివస్తుండగా ఓ కారు ఘోర ప్రమాదానికి గురైన ఘటన ఘట్కేసర్ సమీపంలో చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది.
ప్రమాదం తీవ్రతతో ఇద్దరు యువకులు భార్గవ్, వర్షిత్.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ప్రవీణ్, దినేష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ యువకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.