![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 05:13 PM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలను సమగ్రంగా విడుదల చేయాలని ఆమె అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ, ఇప్పుడు వారిని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. "ఎన్నికల ముందు ఉద్యోగుల మద్దతు కోసం అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులను పూర్తిగా విస్మరించింది," అని మండిపడ్డారు.
కవిత పేర్కొన్న ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న అనేక డీఏలు విడుదల చేయాల్సి ఉన్నా, ఇప్పటివరకు కేవలం ఒక్క డీఏ మాత్రమే విడుదల చేయడమే జరిగిందని అన్నారు. ఈ విధానం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశకు దారి తీస్తోందని ఆమె హెచ్చరించారు.
కావున, ఉద్యోగుల న్యాయమైన హక్కులను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం తక్షణమే అన్ని హామీలను అమలు చేయాలని కవిత కోరారు.