![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 01:20 PM
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జూన్ 8, 9 తేదీల్లో బత్తిన సోదరులు 'చేప ప్రసాదం' పంపిణీ చేయనున్నారు. సుమారు 170 ఏళ్లుగా బత్తిన వంశస్థులు ఆస్తమా రోగులకు ఈ ప్రసాదాన్ని అందిస్తున్నారు.
మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు ఈ చేప మందును ఇస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది ప్రజలు హైదరాబాద్కు చేరుకుంటారు.