|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 08:47 AM
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టిఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'వార్ 2' అత్యంత ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామాలలో ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14, 2025న గొప్ప థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలుగురాష్ట్రాల హక్కులని ప్రముఖ నిర్మాత నాగవంశీ సొంతం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ట్విన్ తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి 500+ బెన్ఫిట్ షోస్ ని ప్లాన్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. కియారా అద్వానీ వార్ 2 లో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. వార్ 2 అనేది హ్రితిక్ రోషన్ యొక్క 2019 స్పై థ్రిల్లర్, వార్ యొక్క సీక్వెల్. ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రం YRF స్పైవర్స్లో భాగం. ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News